ముంబై : కరోనా వైరస్ సంక్రమించిన సచిన్ టెండూల్కర్ ఇవాళ హాస్పిటల్లో చేరారు. మాజీ టీమిండియా క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించారు. తాను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారికి థ్యాంక్స్ తెలిపారు. అయితే వైద్యులు ఇచ్చిన సూచన మేరకు హాస్పిటల్లో చేరినట్లు ఆ ట్వీట్లో సచిన్ తెలిపారు. త్వరలోనే క్షేమంగా ఇంటికి వస్తానన్న ఆశాభావాన్ని కూడా సచిన్ వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంటి వద్దే సురక్షితంగా...
Tag: covid19
స్కూళ్లను మూసేయండి : తెలంగాణ విద్యాశాఖకు వైద్యశాఖ లేఖ
హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున స్కూళ్లు మూసేయాలని తెలంగాణ విద్యాశాఖకు వైద్యశాఖ ప్రతిపాదనలు పంపినట్టుగా తెలుస్తుంది.పరిస్థితులు చేయి దాటక ముందే జాగ్రత్త పడాలని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 700 విద్యార్థులకు పైగా కరోనా భారీన పడ్దారు. గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది.పదవ తరగతి లోపు విద్యార్థులకు స్కూళ్లు మూసివేయాలని ప్రతిపాదించినట్టు తెలుస్తుంది.ఈరోజు లేదా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని స్కూళ్ల మూసివేతపై ప్రకటన వచ్చే అవకాశం...
రాష్ర్టంలో కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచాం:సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. సభ్యులు సూచించిన అనేక అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. గత వారం రోజుల నుంచి రాష్ర్టంలో కరోనా పెరుగుదల కనిపిస్తుంది. కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. దేశం పరిస్థితి కంటే మన రాష్ర్టం పరిస్థితి...
టాలీవుడ్ విలన్ కి కరోనా పాజిటివ్
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండడం అభిమానులని కలవర పరుస్తుంది. కొద్ది రోజుల క్రితం రణ్బీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ తమకు కరోనా సోకిందని ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఇక శుక్రవారం బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్కి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక తాజాగా తెలుగు, హిందీ సినిమాలలో విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న ఆశిష్ విద్యార్ధి...
కరోనా భారీనపడి కోలుకున్న రేణూదేశాయ్…
కరోనా ఏ ఒక్కర్నీ వదిలి పెట్టేలా లేదు. కాలం గడిచేకొద్ది ఒక్కొక్కరుగా కరోనా కష్టాల గురించి చెబుతున్నారు. తాజాగా అందాల నటి రేణూదేశాయ్ తాను కూడా కరోనా బాధితురాలినే అని చెప్పారు. సోషల్ మీడియాలో రేణూ చాలా యాక్టీవ్ అనే విషయం తెలిసిందే.తాజాగా లేట్గానైనా, లేటెస్ట్ విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. తాను కూడా కరోనా బారిన పడ్డానన్నారు. ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి కోలుకున్నట్టు ఆమె వెల్లడించారు. సమాజంలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గలేదన్నారు. కరోనా ప్రభావం ఎప్పట్లానే...
నేటి నుండి రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్
హైదరాబాద్,తీస్మార్ న్యూస్:రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి బడులు తెరుస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.విద్యార్థుల తల్లిదండ్రుల భయాన్ని పోగెట్టే విధంగా మేము బద్రతకు సంభంధించిన వీడియోను పంపామని అధికారులు తెలిపారు. మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల 90 శాతం మంది తల్లిదండ్రులు సమ్మతి తెలిపినట్టు అధికారులు తెలిపారు.
కరోనాతో ఎమ్మెల్సీ మృతి
వైసీపీ ఎమ్మెల్సీ , కర్నూలు జిల్లా సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. గత నెల 13న కరోనాతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన చల్లా చికిత్స పొందుతూ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనాతో ఇప్పటికే పలువురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. మన రాష్ట్రంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో తనువు చాలించిన విషయం తెలిసిందే. ఆయన మృతి నుంచి అధికార పార్టీ కోలుకోకుండానే, మరో ముఖ్యనేత, ఎమ్మెల్సీ చల్లా ప్రాణాలు...
ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై రన్..
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి రెండవ తేదీ నుంచి వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ టీకాలను పంపిణీ చేసేందుకు ఈ డ్రైన్ ఏర్పాటు చేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ డ్రై రన్ నిర్వహించనున్నారు. త్వరలోనే కోవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇవాళ ప్రధాని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రై రన్ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కోవిడ్ టీకాకు భారత...
ఢిల్లీలో కొత్త రకం కరోనా
న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి దేశానికి వచ్చిన వారిలో మరో నలుగురికి కొత్త రకం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో 38 మందికి కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చిందని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. వీరిలో నలుగురికి బ్రిటన్లో వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కరోనా బారిన పడిన వీరిని ఎల్ఎన్జేపీ దవాఖానలోని ప్రత్యేక ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించినట్లు వివరించారు....
సీఎంకి కరోనా పాజిటివ్…పరిస్థితి విషమం
హైదరాబాద్,తీస్మార్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా భారీన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.తీవ్రమైన జ్వరం,ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో భాదపడుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ని డూస్ ఆసుపత్రికి తరలించారు.ఆయన పరిస్థితి విషమించడంతో డూస్ ఆసుపత్రి నుండి ఎయిమ్స్ కి తరలించినట్టు తెలుస్తుంది.ముఖ్యమంత్రికి,ఆయన కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు ఉన్నట్టు డిసెంబర్ 18న ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు.బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం,మాస్క్ తప్పనిసరి అని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది...
- 1
- 2