హైదరాబాద్:రానున్న మూడు రోజులు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.తెలంగాణలోని 16 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ,హైదరాబాద్ కి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి, జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి.అల్పపీడనంతో రెండు రాష్ట్రాల్లోను ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Tag: AndhraPradesh
మంత్రి కేటీఆర్తో గంటా శ్రీనివాసరావు భేటీ
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిశారు. శాసన సభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి...
కేసీఆర్ జన్మదినం సంధర్భంగా అభిమానాన్ని చాటిన ఆంధ్ర రైతు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కెసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కెసిఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని...
అరకు విహరంలో విషాదం
విశాఖ జిల్లా అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మృతి చెందగా 19మంది గాయపడ్డారు. బస్సు ప్రయాణికులందరూ హైదరాబాద్కు చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి అరకు వచ్చి.. తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని, బాధితులకు...
ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో రాసలీలలు
12 ఏళ్ల నాటి రాసలీలలు…నేడు తెరపైకి ఎస్ఈసీ, ఏపీ సర్కార్ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు రేపిన చిచ్చు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎస్ఈసీ తీసుకుంటున్న నిర్ణయాల వెనకున్న ఉద్దేశాలపై జగన్ సొంత పత్రికలో సీరియల్ కథనాలు రాస్తోంది. మరోవైపు చంద్రబాబు అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డకు గట్టి మద్దతుగా నిలిచాయి. దీంతో ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య ఘర్షణకు ఆజ్యం పోసినట్టవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో సాక్షి పత్రికలో 12 ఏళ్ల నాటి రాజ్భవన్ రాసలీలల రహస్యాన్ని...
ఇండియన్ పోస్టల్ శాఖ నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి భారతీయ పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆస్తకి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 3446 జీడీఎస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 1150, ఆంధ్రప్రదేశ్లో 2296 పోస్టులు ఉన్నాయి. వీటిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) లేదా డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి....
జగన్ లాంటి సీఎం ఉండడం ఏపీ ప్రజల…..
ఇది విమర్శకులు చూస్తే భజన అనుకుంటే అనుకోవచ్చు. అభిమానులు మురిసిపోవచ్చు. కానీ తటస్థులుగా ఉన్న వారి కోణం నుంచి ఆలోచిస్తే మాత్రం ఇందులో నిజం ఉంది అనిపించకమానదు. నిజమే జగన్ చేతికి ఎముక లేకుండా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశమే ఆశ్చర్యపోతోంది.ఎక్కడా ఇన్ని పధకాలు లేవు, పేదల కోసం ఇంతలా తపన పడుతున్న సన్నివేశాలు లేవు. ఓ వైపు చూస్తే అన్నింటా చితికిన రాష్ట్రంగా ఏపీ ఉంది. కరోనా వచ్చి మొత్తం ప్రపంచాన్నే ఆర్ధికంగా లేవనీయంతగా...
ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ ఎండీగా ఆర్పీ ఠాకూర్ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను ఆర్టీసీ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్గా ఉన్న ఆర్పీ ఠాకూర్ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రానికి చేరుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్లో తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. మంగళవారం గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ చేరింది. ఎయిర్పోర్ట్ కార్గో నుంచి ప్రత్యేక వాహనాల్లో నిల్వ కేంద్రానికి తరలించారు. పుణె నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు 4,96,680 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను తీసుకొచ్చారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్ఠ భద్రత మధ్య వ్యాక్సిన్ నిల్వ చేస్తున్నారు. రేపు అన్ని...
బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ దుస్సాహసానికి పాల్పడ్డారని సమాచారం. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్నకు పాల్పడ్డారని విశ్వసనీయ సమాచారం. భూమికి సంబంధించి వ్యవహారమే కిడ్నాప్నకు కారణమని తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బోయిన్పల్లిలోని మనో వికాస్నగర్లో నిన్న రాత్రి ముఖ్యమంత్రి సమీప బంధు వులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్రావు (51)తో పాటు ఆయన తమ్ముళ్లైన సునీల్రావు (49), నవీన్రావు (47)లను అఖి లప్రియ భర్త భార్గవ్రామ్ అనుచరులు కిడ్నాప్నకు పాల్పడ్డారని...
- 1
- 2