ఇరవై యేండ్ల క్రితం ఒక్కడితో మొదలైన ఉద్యమ ప్రస్థానం ఇవ్వాళ ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ పతాకం ఎగరేసే దాకా వచ్చింది. మొక్కవోని పోరాట పటిమతో సబ్బండ వర్గాలను ఏకం చేసి, చివరకు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో గొప్ప కార్యాలయం నిర్మాణం కానుంది. ఇది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ గర్వకారణం.