బడ్జెట్‌ తర్వాత ధరలు పెరిగేవి,తగ్గేవి?

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. సోమ‌వారం బ‌డ్జెట్‌ను లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో సామాన్యుడికి నేరుగా లబ్ధి చేకూర్చే అంశాలు పెద్ద‌గా ఏవీ లేవ‌నే చెప్పాలి. కొత్తగా అగ్రిక‌ల్చ‌ర్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సెస్‌ను విధించారు. ఈ సెస్ వ‌ల్ల కొన్ని ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. ఈ బ‌డ్జెట్ త‌ర్వాత ఏయే వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయి?  వేటి ధ‌ర‌లు త‌గ్గుతాయో ఓసారి చూద్దాం.

ధ‌ర‌లు పెరిగేవి:

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు

మొబైల్‌

చార్జ‌ర్

లెద‌ర్ షూ

ప‌ప్పు దినుసులు

ఆటోమొబైల్ విడి భాగాలు

ర‌త్నాలు

సోలార్ ఇన్వ‌ర్ట‌ర్లు

ముడి పామాయిల్‌

సోయాబీన్‌

స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌

యాపిల్స్

ధ‌ర‌లు త‌గ్గేవి:

ఐర‌న్

స్టీల్

నైలాన్ బ‌ట్ట‌లు

కాప‌ర్ వ‌స్తువులు

ఇన్సూరెన్స్‌

విద్యుత్తు

డ్రై క్లీనింగ్

వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు