చ‌రిత్ర‌లో ఈరోజు

ఉత్త‌ర అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలో మంచుకొండ‌ను ఢీకొట్టి రెండు ముక్కలైన టైటానిక్ నౌక‌.. 1912 లో సరిగ్గా ఇదే రోజున మునిగిపోయింది. నౌక‌లోని దాదాపు 1500 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ నౌక బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నౌకాశ్రయం నుంచి న్యూయార్క్ వెళ్తుండ‌గా ఈ ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. దీని క‌థ‌ను ఆధారంగా చేసుకుని 1997 లో టైటానిక్ అనే సినిమాను కూడా నిర్మించారు. ఈ సినిమాలో ఆరోజో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను కండ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు.

టైటానిక్ 20 వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లండ్ ఓడల నిర్మాణ సంస్థ వైట్ స్టార్ లైన్ నిర్మించింది. దీని నిర్మాణం 1909 లో ప్రారంభమై.. 1912 లో పూర్తయింది. దీనికి 1912 ఏప్రిల్ 2 న సముద్ర పరీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం త‌న‌ మొదటి ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ నౌక అనూహ్యంగా ఉత్త‌ర అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో ఉన్న పెద్ద మంచుకొండ‌ను గుర్తించలేక‌ దానిని ఢీకొట్టింది. ఏప్రిల్ 14-15 రాత్రి స‌మయంలో ఈ ఓడ పూర్తిగా సముద్రంలోకి జారిపోయింది.

ప్రమాదం గురించి చాలా ప్రశ్నలు వినిపిస్తుంటాయి. ఓడ కెప్టెన్ స్మిత్ మంచుకొండ హెచ్చరికలను పట్టించుకోలేదని, ఓడ వేగాన్ని తగ్గించలేదని చెప్తారు. ప్రమాదం తరువాత చాలా లైఫ్ బోట్లను సగం ఖాళీగా పంపించామని, మిగిలిన ప్రయాణికులను తీసుకెళ్లడానికి తిరిగి రాలేదని కూడా చెప్తారు. ఓడ 3 రోజులుగా మంటల్లో ఉన్నట్లు కూడా అంటుంటారు.

చంపారన్ సత్యాగ్రహం ప్రారంభం

టైటానిక్ ప‌డ‌వ మునిగి 1500 మంది దుర్మ‌ర‌ణం.. చ‌రిత్ర‌లో ఈరోజు

బిహార్‌లోని రైతుల‌పై బ్రిటిష్ వారు చేస్తున్న దారుణాల‌కు నిర‌స‌న‌గా మ‌హాత్మాగాంధీ 1917 లో స‌రిగ్గా ఇదే రోజున బిహార్‌లోని చంపారన్ జిల్లాకు వచ్చి స‌త్యాగ్ర‌హాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వారు ఇక్క‌డి రైతులను ఇండిగో సాగు చేయమని బలవంతం చేయ‌డంతో.. రైతులు తమ పొలాల్లో 20 భాగాలలో మూడో వంతు ఇండిగో సాగు చేయవలసి వచ్చింది. రైతులపై జరిగిన దారుణాలకు వ్యతిరేకంగా మ‌హాత్మాగాంధీ సత్యాగ్రహాన్ని చేప‌డుతున్న‌ట్లు పిలుపునిచ్చారు. అశాంతిని కలిగించాడనే ఆరోపణలతో గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక్కడి రైతులకు గాంధీ అరెస్ట్ వార్త రాగానే వారు పోలీస్ స్టేషన్ సహా కోర్టు వెలుపల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సత్యాగ్రహం ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం చంపారన్ వ్యవసాయ బిల్లును అమలు చేయాల్సి వచ్చింది. దీని తరువాత, 135 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఇండిగో సాగు క్రమంగా నిలిచిపోయింది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2019 : మొదటిసారి బ్లాక్ హోల్‌ ఫోటోను విడుదల చేసిన ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు

2010: పోలాండ్ అధ్యక్షుడు లేఖ్ కాజిస్కీ, అతని భార్య మరియా విమాన ప్రమాదంలో దుర్మ‌ర‌ణం

2008: కేంద్ర విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ సహాయక విద్యా సంస్థలలోని ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్లకు భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ఆమోదం

2001: ప్ర‌పంచంలోనే తొలిసారిగా ఉద్దేశపూర్వక మరణాన్ని ఆమోదించడానికి చ‌ట్టాన్ని తీసుకొచ్చిన నెదర్లాండ్స్

1982: బహుళ ప్రయోజన ఉపగ్రహం ఇన్సాట్‌-1ఏ విజయవంతంగా ప్రయోగించిన భార‌త్‌

1973: పాకిస్తాన్‌లో అమల్లోకి వచ్చిన కొత్త రాజ్యాంగం

1972: ఇరాన్‌లో భూకంపం సుమారు 5 వేల మంది మృతి

1953: మొదటి రంగు 3-డి చిత్రం హౌస్ ఆఫ్ వాక్స్ న్యూయార్క్‌లో విడుదల

1941: కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ జన‌నం

1932: హిందూస్థానీ సంగీతం ప్రసిద్ధ గాయకుడు, ప‌ద్మ‌విభూష‌ణ్‌ కిషోరి అమోంకర్ జననం

1931: ప్రముఖ రచయిత ఖలీల్ గిబ్రాన్ మరణం

1894: భారత పారిశ్రామికవేత్త ఘన్శ్యామ్‌దాస్ బిర్లా జన‌నం

1875: ఆర్య సమాజ్ స్థాపించిన స్వామి దయానంద్ సరస్వతి

1849: అమెరికాలో సేఫ్టీ పిన్‌కు వాల్టర్ హంట్ అనే వ్యక్తికి ద‌క్కిన‌ పేటెంట్

1847: అమెరికన్ జర్నలిస్ట్ జోసెఫ్ పులిట్జర్ జననం

1710: ప్రపంచంలో మొట్టమొదటి కాపీరైట్ చట్టం బ్రిటన్‌లో అమలు

1633: లండన్‌లో అరటి అమ్మకాలు తొలిసారిగా ప్రారంభం