హైదరాబాద్,తీస్మార్ న్యూస్:బుధవారం ఉదయం దుండిగల్లోని బాలానగర్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై సిమెంటు రెడీ మిక్సర్ ట్రక్ కింద ఓ మహిళ నలిగిపోయింది.సుశీల అనే మహిళ ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్నది. నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా ఆమెను రెడ్ మిక్స్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.