వరంగల్,తీస్మార్ న్యూస్: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది.ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలోని పెద్దజాలుగుంటలో బాకాటి సుమన్,సుంచు మాధవి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.వీరి మృతికి అక్రమ సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వీరు వరుసకు అత్తా,అల్లుడు అవుతారని తెలుస్తుంది.సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
