ఐపీఎల్‌-2021 మినీ వేలం తేదీ, వేదిక…

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 14వ సీజన్‌ కోసం  మినీ ఆటగాళ్ల వేలం  ఫిబ్రవరి 18న చెన్నైలో జరుగుతుందని   ఐపీఎల్‌ బుధవారం ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌లు జరిగే వేదిక, తేదీలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది సీజన్‌ ఏప్రిల్‌-మే నెలల్లో జరగనుందని తెలుస్తోంది.  2020 ఎడిషన్‌ పూర్తిగా యూఏఈలోనే జరిగిన విషయం తెలిసిందే.

జనవరి 20తోనే ఐపీఎల్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా  ఆయా  ఫ్రాంఛైజీలు  పలువురు ఆటగాళ్లను కూడా  వదులుకున్నాయి. జట్ల మధ్య ప్లేయర్ల  ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4న ముగియనుంది.  139 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు అట్టిపెట్టుకోగా 57 మందిని వేలంలోకి విడిచిపెట్టారు.