బ్రిస్బేన్: ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్లో సాధించిన చారిత్రక విజయంతో టీమిండియా మరోసారి టెస్ట్ చాంపియన్షిప్లో నంబర్ వన్గా నిలిచింది. ఇప్పటి వరకూ తొలి స్థానంలో ఉన్న ఆసీస్ మూడోస్థానానికి దిగజారింది. ఇప్పటి వరకూ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా 5 సిరీస్లలో 13 టెస్టులు ఆడిన టీమిండియా.. 9 విజయాలు సాధించి, మూడింట్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. 71.7 శాతం విజయాలతో టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది. మరోవైపు ఆస్ట్రేలియా 4 సిరీస్లలో మొత్తం 14 మ్యాచ్లు ఆడి 8 గెలిచి, నాలిగింట్లో ఓడింది. మరో 2 డ్రాగా ముగిశాయి. ఆసీస్ ఖాతాలో 332 పాయింట్ల ఉండగా.. 69.2 శాతం విజయాలతో మూడోస్థానంలో ఉంది. 70.0 శాతం విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
India on ????
After the hard-fought win at The Gabba, India move to the No.1 spot in ICC World Test Championship standings ????
Australia slip to No.3 ????#WTC21 pic.twitter.com/UrTLE4Rui0
— ICC (@ICC) January 19, 2021