‘కథ కంచికి మనం ఇంటికి’, ‘డియర్ మేఘ’ అంటున్నారు హీరో అదిత్ అరుణ్. ఈ కుర్ర హీరో నటిస్తున్న తాజా చిత్రాల టైటిల్స్ ఇవి. మంగళవారం అదిత్ అరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా డబుల్ ధమాకాలా ఈ రెండు చిత్రాల లుక్స్ని విడుదల చేశారు. ‘కథ కంచికి మనం ఇంటికి’లో అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా నటించారు. నూతన దర్శకుడు చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు...
Category: cinema
సోనూసూద్ సాయం
ఓ కరోనా బాధితుడికి ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ప్రాణవాయువు అందించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన రణబోతు వీరారెడ్డి(65) 25 రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా రూ.6 లక్షలు ఖర్చు అయింది. అయినా నిత్యం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుండటం, చేతిలో డబ్బు లేకపోవడంతో కుమారుడు సతీశ్రెడ్డి వారం క్రితం తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు. ఖమ్మం నుంచి నిత్యం ఆక్సిజన్ సిలిండర్ తెచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. ఈ...
అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం ఇది కాదు
నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్యకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పుకప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితమైన రేణూ.. ఆపదకాలంలో ప్రజలకు తోడుగా తనవంతు సాయం చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్తో మాట్లాడుతూ ధైర్యాన్ని అందిస్తున్నారు. ఈ...
దయచేసి పుకార్లను నమ్మొద్దు
కరోనా సెకండ్ వేవ్తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మరికొందరు మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే కీర్తీ సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్లక్ సఖి’ కూడా ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందించి, ‘‘మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తాం. దయచేసి పుకార్లను నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో, ఆది పినిశెట్టి, జగపతిబాబు...
మరోసారి ప్రేమలో పడిందట
అల్లరి పిల్ల, అందాల తారా రష్మిక మందన్నా మరోసారి ప్రేమలో పడిందట. అది కూడా కేవలం మూడు మిల్లీ సెకన్లనే పడిపోయిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సాధారణంగా ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుందని తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ప్రేమలో పడ్డానని రష్మిక తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి ప్రేమలో పడింది మనుషులతో కాదు, తన లిటిల్ పెట్...
ఓటీటీలో కీర్తి మరో సినిమా
మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ నటించిన మరో సినిమా ఓటీటీలో విడుదలవుతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కీర్తి సురేశ్ ముఖ్య పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి అనే సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకానుందట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు లేకపోవడంతో ‘గుడ్ లక్ సఖి’ని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5తో చర్చలు కూడా జరిపారట. త్వరలోనే...
నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు
లాక్డౌన్ సమయంలో చాలా మంది హీరో, హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. కొంతమంది చెప్పి చేసుకుంటే.. మరికొంత మంది రహస్యంగా పెళ్లి చేసుకొని షాకిచ్చారు. ఇంకొంత మంది రిలేషన్ షిప్లో ఉండి, పెళ్లి కోసం రెడీ అవుతున్నారు. ఇలా సినీ సెలెబ్రిటీలంతా పెళ్లి బాట పట్టడంతో అందరి చూపు ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్పై పడింది. ఈ లిస్ట్లో హీరోయిన్ అంజలి కూడా ఉంది. ఈ తెలుగమ్మాయి ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి....
రెండో పెళ్లికి రెడీ అయిన సీనియర్ నటి
సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లికి రెడీ అయిందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఆమె మూడు ముళ్లు వేయించుకోనుందంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మీద వస్తున్న వార్తలను కొట్టిపారేసింది నటి ప్రేమ. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది. అలాగే తన ఆరోగ్యం మీద వస్తున్న వదంతులను నమ్మవద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంది. నటి...
పొలిటిషియన్గా యంగ్ టైగర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే పొలిటిషియన్గా కనిపించబోతున్నారా అంటే.. అవుననే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్ని పవర్ ఫుల్ పొలిటీషియన్గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ఈ సినిమాలో ఎన్టీఆర్ సైంటిస్టుగానో.. మాఫియా డాన్గానో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి....
ఓటీటీలో విడుదల కానున్న ‘రష్మీ రాకెట్’
కరోనా సెకండ్వేవ్ కారణంగా సినిమా థియేటర్లకు తాళం పడింది. దీంతో ఓటీటీల డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరోల సినిమాలు సైతం నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం‘రష్మీ రాకెట్’నేరుగా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు బీటౌన్లో...