ప్రముఖ నటుడు ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. పునీత్ రాజ్కుమార్ బాలనటుడిగా సుమారు 14 సినిమాల్లో నటించారు. 2002లో ‘అప్పు’ (తెలుగులో ‘ఇడియట్’)తో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత వరుస...
Category: BreakingNews
తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం
హైదరాబాద్:రానున్న మూడు రోజులు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.తెలంగాణలోని 16 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ,హైదరాబాద్ కి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి, జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి.అల్పపీడనంతో రెండు రాష్ట్రాల్లోను ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఎమ్మెల్సీ కవిత క్యాన్వాయ్లో ప్రమాదం..
మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కే. కవిత కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గురువారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. Video Source From:V6 News
కడలిలో కల్యాణం
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. ఆలోచనలు, ఆశయాలు, అభిప్రాయాలు ఏ ఒక్క వ్యక్తి సొంతం కాదు. తమ ఆశయాలకు తగ్గట్టు ఆదర్శంగా జీవించాలని తపన పడుతుంటారు. అలా తపన పడుతున్న వారిలో తమిళనాడులోని చిన్నదొరై ఒకడు. కాలుష్యం నుంచి కడలి (సముద్రం)ని కాపాడుకునేందుకు, దానిపై అవగాహన కల్పించే ఆశయంతో వినూత్నంగా ఆలోచించాడు. అందులో భాగమే కడలిలో కల్యాణం చేసుకుని లోకం దృష్టిని ఆకర్షించాడు.తిరువన్నామలైకి చెందిన చిన్నదురైకి ప్రకృతిపై విపరీతమైన మమకారం. కాలుష్యంబారిన పడి కడలి నాశనమవుతోందని...
రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్హౌస్లోని బాపుఘాట్ వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ క్రమంలో బాపుఘాట్, లంగర్హౌజ్, నానల్ నగర్, ఆంధ్రా ఫ్లోర్ మిల్, సంగం బస్టాప్ పరిసరాల్లో ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ మార్గాల్లో...
క్రికెట్ దిగ్గజం పొలార్డ్ మృతి?
హైదరాబాద్ : వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ చనిపోయడంటూ సోసల్ మీడియాలో నిన్న రాత్రి నుండి వీడియోలు వైరల్ అవుతున్నాయి. పొలార్డ్ కారు ప్రమాదంలో మృతి చెందాడు అంటూ యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలను వైరల్ చేశారు నెటిజన్లు వాట్సాప్ స్టేటస్సులో ఈ వీడియోలు దర్శనమిచ్చాయి. దీంతో నింజాగానే పొలార్డ్ చనిపోయడంటూ చాల వరకు పోస్టులు పెట్టెసారు. అయితే పొలార్డ్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం పొలార్డ్ అబుదాబిలో టి10లీగ్ క్రికెట్...
సొంతింటి కల నెరవేర్చిన మంత్రి కేటీఆర్
నల్లగొండ : నల్లగొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్) ని మంత్రి ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా స్థానిక జిల్లా కలెక్టర్...
బాయ్ ఫ్రెండ్ లేకపోతే కాలీజీలోకి నో ఎంట్రీ
అమ్మాయిలు అలర్ట్.. వాలెంటైన్స్ డే నాటికి మీకు కనీసం ఒక్క బాయ్ప్రెండ్ అయినా ఉండాలి. లేకపోలే మిమ్మల్ని ఆ రోజు నుంచి కాలేజీకి రానివ్వం. మీకు బాయ్ ప్రెండ్ ఉన్నాడనడానికి రుజువుగా అతడితో కలిసి దిగిన ఓ ఫోటోను చూపించాలి. ఇదంతా మీ భద్రత కోసమే. అంటూ ఓ కాలేజీ యాజమాన్యం ఆ కాలేజీ విద్యార్థినులకు పంపిన ఓ సర్క్యులర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సర్క్యులర్ సారాంశం అంతటితో ఆగలేదు. ‘అమ్మాయిలూ.. ప్రేమను...
ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో రాసలీలలు
12 ఏళ్ల నాటి రాసలీలలు…నేడు తెరపైకి ఎస్ఈసీ, ఏపీ సర్కార్ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు రేపిన చిచ్చు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎస్ఈసీ తీసుకుంటున్న నిర్ణయాల వెనకున్న ఉద్దేశాలపై జగన్ సొంత పత్రికలో సీరియల్ కథనాలు రాస్తోంది. మరోవైపు చంద్రబాబు అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డకు గట్టి మద్దతుగా నిలిచాయి. దీంతో ఎస్ఈసీ, జగన్ సర్కార్ మధ్య ఘర్షణకు ఆజ్యం పోసినట్టవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో సాక్షి పత్రికలో 12 ఏళ్ల నాటి రాజ్భవన్ రాసలీలల రహస్యాన్ని...
హైదరాబాద్లో ఎయిర్టెల్ 5జీ సేవలు
న్యూఢిల్లీ: మీరు ఎయిర్టెల్ వినియోగదారులా.. అయితే హైదరాబాద్లో 5జీ సేవలందించేందుకు ఎయిర్టెల్ సిద్ధమైంది. దీనివల్ల 5జీ ఫోన్ నుంచి ఫుల్లెంత్ సినిమాను సెకన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతోపాటు సరిపడా స్పెక్ట్రం జారీ విడుదల చేసిన తర్వాత 5జీ సేవలు వినియోగదారులకు లభ్యం కానున్నాయి. తద్వారా దేశంలో తొలిసారి విజయవంతంగా 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చిన సంస్థగా ప్రముఖ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ నిలిచింది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోకమర్షిల్...