పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాలు 12 శాతం తగ్గినట్లు మంత్రి కేటీఆర్కు మహేశ్ భగవత్ వివరించారు. మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.సైబర్ నేరాల నిరోధానికి ఈ ఏడాది నుంచి సైబర్ యోధ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రికి వివరించారు. రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను మహేశ్ భగవత్… కేటీఆర్కు అందించారు.
