ఫారెస్ట్ డైరీనీ ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్స్ (FROs) 2021 సంవత్సర డైరీని అర‌ణ్య భ‌వ‌న్‌లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి  ఆవిష్కరించారు. అర‌ణ్య భ‌వ‌న్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్, శోభ‌,  ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు వి.మోహ‌న్, షౌక‌త్ అలీ, సీహెచ్. వెంక‌ట‌య్య గౌడ్, విజ‌య భాస్కర్‌, సత్యనారాయ‌ణ‌మ్మ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.