మృత్యుంజయ యజ్ఞంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
• హైదరాబాద్ గగన్ పాడ్ లో మహా మృత్యుంజయ యజ్ఞం.
• సకల దేవతల స్వరూపం.. దైవానికి ప్రతి రూపం గోవులు.. గోవులను పూజించిడం మన సంస్కృతి సాంప్రదాయం…
. ఏ పూజ చేసిన , ఏ శుభ కార్యక్రమం చేసిన మొదట గోపూజ చేస్తాం అది మన ఆచారం ఆనవాయితీ.
• ఇంత మంచి గోశాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ ను అభినందిస్తూ.
• ఈ గోశాలకు నా వేతనం నుండి గోశాలకు ఒక రోజు అయ్యే ఖర్చు ఒక లక్ష యాభై వెయిల రుపాయలు అందిస్తున్నాను.
• ఇంత పెద్ద గోశాల మన హైదరాబాద్ నగరాన్ని అనుకోని ఉన్నది..
• దక్షిణ భారత దేశం లో మొట్ట మొదటిది భారత దేశం లో రెండవ అతి పెద్దది.. 5500 గోవులను మార్వాడి పెద్దలందరు గోవులను సంరక్షిస్తూన్నారు..
• కబేళాలకు వెళ్ళవలసిన గోవులను తెచ్చి రక్షించి వాటికి పునర్జన్మ నిస్తున్నారు.
• ఈ సమాజం అంత బాగుండాలని చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు..
• నాకు చాలా సంతోషంగా ఉన్నది గోవు చాలా ముఖ్యమైనది మనిషికి రైతుకు ఆవు ఉంటే చాలు అనేవారు..
పాత రోజులలో గో మూత్రం ,గో మలం,వేపాకు చక్కటి సేంద్రియ ఎరువులతో కూడిన వ్యవసాయం చేసేవారు అదే యురియా,పెస్టిసైడ్స్ ల వాడే వారు
• మంచి వ్యవసాయాన్ని చేసేవారు మంచి పంటలు పండించారు
ఆరోజులలో క్యాన్సర్ లాంటి పలు విధాలా రోగాలు లేవు..
• ఈ రోజుల్లో టెక్నాలజీ ఏవిధంగా పెరిగిందో రసాయనల ఎరువుల వాడకం పెరిగింది.
• అందుకే ఈ మధ్య కాలం లో హైదరాబాద్ లో ఆర్గానిక్ షాపులు కనిపిస్తున్నాయి.
• డబుల్ ధరలు పెట్టికూడా కొనుకుంటున్నాము. మళ్ళీ ఈ సేంద్రియ వ్యవసాయం గోవు ,గో మూత్రం ,గో మలం ప్రాముఖ్యత ను గుర్తిస్తున్నారు..
• మంచి తాత్కాలికంగా పోవచ్చు కానీ చివరకు అదే నిలబడుతుంది..
• నా సిద్దిపేట నియోజకవర్గం లో సేంద్రియ వ్యవసాయం చేసెరైతులను గుర్తించి 150 మందికి గోవులను దానం ఇవ్వడం జరిగింది.
• ఆర్గానిక్ ఫామ్ సేంద్రియ వ్యవసాయం చేయండని కోరాము.
• ఇక్కడకు వచ్చి చూశాక ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం
• ఇంతమంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు.