ముఖ్యమంత్రి కేసీఆర్  అన్ని మతాలను గౌరవిస్తారు : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ లో రానున్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తారు.
మైనారిటీల సంక్షేమానికి, ఉన్నతికి బడ్జెట్ లో 1518కోట్లు కేటాయించాం
నగరంలో అధునాతన క్రిస్టియన్ భవనాన్ని నిర్మిస్తున్నాము అన్నారు.
క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లలోని 2.40లక్షల మంది నిరుపేదలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేస్తాం.
కోవిడ్ నిబంధనల కారణం ఈసారి ముఖ్యమంత్రి విందును నిర్వహించలేపోతున్నాం
ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని మతాలను గౌరవిస్తారని, ప్రజలందరి బాగు కోసం కృషి చేస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్నారని మంత్రి అన్నారు.
క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్నందున ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణ,గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ ఏర్పాట్ల గురించి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో 1518కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు.నగరంలో అధునాతన క్రిస్టియన్ భవనాన్ని నిర్మిస్తుండడాన్ని ప్రస్తావించారు.
ఆరేళ్ల నుంచి జరుపుతున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రిస్టియన్లలోని 2.40మంది నిరుపేదలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ గిఫ్ట్ ప్యాక్ లలో చీరలతో పాటు పంజాబీ డ్రెస్సులు, దుస్తులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరంలో వీటిని వచ్చే నెల 12నుంచి 15వ తేదీ వరకు, జిల్లాలలో 11వ తేదీ నుంచి 15వరకు పంపిణీ జరిగేలా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు.
క్రిస్టియన్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిఏటా ఇచ్చే విందు, జిల్లాలలో ఏర్పాటు చేసే విందులు కోవిడ్ నిబంధనల కారణంగా ఈ సారి నిర్వహించడం లేదని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేయనున్న చీరలను పరిశీలించారు. సమావేశంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి కాంతివెస్లీ,టిస్కో జాయింట్ డైరెక్టర్ యాదగిరి తదితర అధికారులు పాల్గొన్నారు.