యూకే విమానాలపై నిషేధం విధించిన కేంద్రం

న్యూఢిల్లీ,తీస్మార్ న్యూస్: బ‌్రిట‌న్‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11.59 గంట‌ల నుంచి డిసెంబ‌ర్ 31 రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌కు అనుమ‌తి లేదు అని కేంద్ర విమానయాన శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, బెల్జియం, కెన‌డా, ఇట‌లీ, ఆస్ట్రియా వంటి దేశాలు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే.