హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్కు కంగ్రాట్స్ అంటూ పద్మారావు వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. బహుశా త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్కు శాసనసభ, రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, షకీల్ పేర్కొన్న విషయం విదితమే. సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడే అని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.