హైదరాబాద్,తీస్మార్ న్యూస్:ఈ నెల 7వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది రెండవ విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీ పై ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
