అగ్నికి ఆహుతైన బంగారు  భవిష్యత్తు

పశ్చిమ గోదావరి,తీస్మార్ న్యూస్:జిల్లాలోని గురుభట్ల గూడెం గ్రామానికి చెందిన మహేష్ బాబు ఉన్నత చదువు కోసం పొలం అమ్మి 20 లక్షలు సిద్ధం చేసుకున్నాడు.భవిష్యత్తు కోసం కలలు కన్న మహేష్ బాబు కి పిడుగుపాటు రూపంలో కన్నీరు మిగిలింది.చదువు కోసం దాచుకున్న డబ్బు కళ్ళ ముందే ఆహుతవుతుంటే ఏమి చేయలేని నిస్సాహయక పరిస్థితి ఆ కుటుంబానికి కన్నీరు మిగిల్చింది.అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా కూడా వారు సరిగ్గా స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారు ఆ విద్యార్థి చదువుకు అండగా నిలిస్తే బాగుండు అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు